గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు గణపురం మండల కేంద్రానికి చెందిన మామిండ్ల లీల మల్లికార్జున గౌడ్ దంపతులు రూ.10 వేలతో పూజా సామాగ్రిని సోమవారం అందజేశారు. మొదట వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపురం చైర్మన్ మునిగాల రమేష్ దంపతులు తంగళ్ళపల్లి లింగమూర్తి పాల్గొన్నారు ఆలయానికి పూజా సామాగ్రి అందజేసిన లీల మల్లికార్జున్ గౌడ్ దంపతులకు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.