ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ
మెట్ పల్లి జూన్ 25 నేటి ధాత్రి:
మెట్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల విట్టంపేట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్లు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సన్నీ, రవితేజ సతీష్ లు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్పీ విక్రమ్ కుమార్ ఉపాధ్యాయ బృందం ఎస్ భానుతేజ, లక్షణ, సుచిత లు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.