రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

Farmers Farmers

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చారకొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో.. లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతులు నూతన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తు చేసుకున్నారని.. లో వోల్టేజీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనందకుమార్, బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్,జిల్లెల్ల రాములు, దున్న సురేష్, పడకండి వెంకటేష్, చంద్రకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!