ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Government Whip Dr. Ramachandra Nayak Government Whip Dr. Ramachandra Nayak

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో హాల్లో ఈ రోజు వివిధ సంక్షేమ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డా. రామచంద్రు నాయక్ హాజరై, పలు పథకాలు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన సామాన్య ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతుందన్నారు,ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,” అన్నారు, కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులు 74 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద స్థలల పట్టాలు 258 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఇల్లు కట్టుకునే వారికి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు, గోడలు కట్టినాక లక్ష రూపాయలు,స్లాప్ లెవెల్ లక్ష రూపాయలు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందన్నారు,కల్లు గీత కార్మికులకు 82 కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీమెకుల కిట్టు పంపిణీ చేశారు,రాజీవ్ యువ వికాసo ద్వారా యువతకు వ్యాపార రంగంలో, ఇతర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహమూర్తి,స్థానిక ఎమ్మార్వో కృష్ణవేణి,ఎంపీడీవో విజయ,ఎంపీఓ సొమ్లాల్,ఆర్ఐ శరత్ గౌడ్, మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు జిల్లా నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!