కంటి ఆపరేషన్ చేసుకున్న రోగులకు పండ్ల పంపిణీ.

చెన్నూర్,నేటి ధాత్రి::

లయన్స్ క్లబ్ గరిమెళ్ళ,రెకుర్థి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి అధ్వర్యంలో లో 3వ బ్యాచ్ కి విజయవంతంగా కంటి ఆపరేషన్ లు పూర్తి అయిన సందర్భంగా చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయం లో రోగులకు పండ్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు మొడుంపురం వెంకటేశ్వర్ తెలిపారు.ఇప్పటి వరకు 150 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించమని అందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.మళ్ళీ ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ మార్చ్ 18 న నిర్వహిస్తామని తెలిపారు.ఈ క్యాంప్ ఇంత విజయవంతంగా కొనసాగడానికి కౌన్సిలర్ జాడి సురేఖ – తిసుపతి ,రిటైర్డ్ టీచర్ రాములు , రామ్టెంకి.రమేష్, బైక్ రవి మరియు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *