ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ
రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో
ఎమ్మార్వో సత్యనారాయణ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని 30 రేషన్ షాప్స్ డీలర్స్ తో తహసీ ల్దార్ కార్యాలయంలో సమా వేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంది కాబట్టి డీలర్స్ వద్ద ఏమైనా మార్చి నెల దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే అట్టి నిల్వలను పై నుండి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు బియ్యం ఇవ్వరాదని ,సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రతి రోజు ఉదయం 7 గం.లకు తీయాలని ,ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ ఉన్న వారి దగ్గర డబ్బులు ఇచ్చి బియ్యం కొనకూడదు అలాంటి కంప్లైంట్స్ వస్తె 6-A కేసులు పెట్టుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆర్ ఐ తోపాటు మల్లయ్య అద్యక్షుడు మరియు డీలర్స్ పాల్గొన్నారు.