మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ@ ముడా డైరెక్టర్ వై జి.ప్రితమ్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మాజీ మంత్రివర్యులు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఫిబ్రవరి 3 తేదీన పుట్టినరోజు సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లి టచ్ అనాధ ఆశ్రమంలో బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను, జడ్చర్ల మాజీ వార్డు సభ్యులు మాజీ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ @మూఢ డైరెక్టర్ వై.జి.ప్రీతమ్ అనాధ పిల్లలకు అందజేశారు.ఆశ్రమంలోని చిన్నారులు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3 తేదీ శనివారం ఉదయం 9గంటలకు చంద్ర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జడ్చర్ల నియోజకవర్గం లోని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు.