సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…. అభివృద్ధి పనులను పరిశీల

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నర్సంపేట పట్టణానికి చెందిన 13వ వార్డుకు చెందిన కాసుల లక్ష్మణచారికి 60 వేల రూపాయల చెక్కును రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందించారు.అదేవిదంగా 19వ వార్డుకు చెందిన కొలువుల రాంబాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందగా చికిత్సకు నిమిత్తం జరిగిన ఖర్చుకు 36 వేల రూపాయల చెక్కును వారి తల్లి కొలువుల ఉదియ, భార్య కొలువుల సుమలతలకు అందజేశారు.అదే విధంగా పలు అభివృద్ధి పనులను పెండెం రామానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెండెం రామానంద్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తంగా, నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు, పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులలో వేగవంతంగా పూర్తి చేయాలని వారు మాట్లాడుతూ అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, కొల్లూరి రాజు, వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండి రాజేష్, పైండ్ల పవన్, వజినపల్లి లక్ష్మయ్య, శ్రీరామోజు రమేష్, కాసుల రాజు, రంగోజు వెంకటేశ్వర్లు, తుముగంటి వీరచారి కొలువుల స్వామి, అందె రంజిత్, కాట రాహుల్, కొలువుల రాజు, మండ హరీష్, దిడ్డి రంజిత్, దిడ్డి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!