మిట్టపల్లి మిత్ర మండలి ఆధ్వర్యంలో బుక్స్ ,పెన్నులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

సినిగేయ రచయిత, నంది అవార్డు గ్రహిత మిట్టపల్లి సురేందర్ జన్మదినం సందర్బంగా చిట్యాల మండల కేంద్రంలో మిట్టపల్లి మిత్ర మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అల్ ఇన్ ఇన్ బుక్స్ మరియు పెన్నులు అందచేసి ఘనంగా నిర్వహించడం జరిగింది*. ఈ సందర్బంగా మిట్టపల్లి మిత్ర మండలి వ్యవస్థపాక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతం లో జన్మించి సినీ గేయ రచయిత గా రాణిస్తున్న మిట్టపల్లి సురేందర్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ముందు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొంది భూపాలపల్లి జిల్లాకు పేరు ప్రాఖ్యతలు తీసుకురావాలని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం శ్రీరామ్ రఘుపతి, గుంటూరు పల్లి మాజీ సర్పంచ్ పువ్వాటి రాణి వెంకటేశ్వర్లు, ప్రముఖ జానపద కళాకారులూ గోల్కొండ బుచ్చన్న, జన్నే యుగేందర్, పుల్యాల నరేష్, మిట్టపల్లి మిత్ర మండలి సభ్యులు మాసు రమేష్, పుల్ల అశోక్, సంజయ్, సన్నీ,కవులు కళాకారులూ, పాఠశాల ఉపాధ్యాయులు బుర్ర సదయ్య,రాజమౌళి, ఊర్మిళ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!