వీరాంజనేయ మండల పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న మాజీ మంత్రి
సతీమణి సింగిరెడ్డి.వాసంతి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ సందర్భంగా పాతబజార్ వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్ణిర్మానం లో భాగంగా 45రోజులు మండల పూజ, గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు
వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గుడి పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చారు
ఈ సందర్బంగా పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ని ఆలయ నిర్వాహకులు సన్మానించారు, అన్న ప్రసాద వితరణ చేసి భక్తుల తో పాటు స్వీకరించారు
ఆలయ నిర్వాహకులు నీలస్వామి, ఎర్రశ్రీను గణేష్ వాకింగ్ టీమ్ అధ్యక్షులు. గోనూరు వెంకటయ్య, బాలస్వామి,సూర్యావంశం గిరి, మెహన్, సునీల్ వాల్మీకి, శివ లక్ష్మణ్ గౌడ్, బాలరాజు, రాజు, రవి, జస్వంత్ వాల్మీకి, ఇమ్రాన్, మునికుమార్, అలీం మరియు ముఖ్యులు పాల్గొన్నారు.