కోటగుళ్లు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు సోమవారం గణపురం వాస్తవ్యులు హైదరాబాదులో నివాసం ఉంటున్న హెచ్ఎండిఏ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవల్ల వనజ, గురువయ్య దంపతులు, అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన శామంతుల విజయలక్ష్మి, వీరన్న టీచర్ దంపతులు దాన బస్తాలను అందజేశారు. మొదట స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన దంపతులకు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!