చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను ఏ నోటిస్ లు లేకుండా తొలగింపు అనేది అక్రమం,
వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం*
నేటి ధాత్రి భద్రాచలం
చర్ల మండలం మొగల్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటిస్ లు లేకుండా వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది* వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మార్వో శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్* మాట్లాడుతూ ఏ ఆంక్షలు లేకుండా
ఎన్నో నెలలుగా వీరు మొగళ్లపల్లి ర్యాంపులలో పనిచేస్తున్నారు రెక్కాడితే డొక్కాడని కుటుంబం నుంచి ఆదివాసి గ్రామస్తులు పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు భారత రాజ్యాంగం 1/70, పిసా యాక్ట్ ను అమలులో ఉన్న అన్యం పుణ్యం తెలవని అమాయకులు వారి హక్కులను మరచిపోయి పొట్టకూటి కోసం పని చేస్తుంటే ఆదివాసి చట్టాలను కూడా అతిక్రమిస్తూ ఇసుక మాఫియా యాజమాన్యం పెత్తనం చలాయిస్తుందని వారన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా వారు చేసిన తప్పేందో తెలియకుండా వారిని విధుల్లోంచి తొలగించడం సరైనది కాదని తక్షణమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ యువకులను ఇసుక ర్యాంపు పనిలోకి తీసుకోవాలని లేనిచో దశల వారి ఆందోళన చేస్తామని పై అధికారులను కలుస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పవన్ వి నాగరాజు మునేశ్వరరావు సంటి వాదం సుధాకర్ అశోక్ సత్యనారాయణ నరేష్ పవన్ రాము తదితరులు పాల్గొన్నారు