మిస్సయిన యువకుని మృతదేహం లభ్యం…

మిస్సయిన యువకుని మృతదేహం లభ్యం…

నూగూర్ వెంకటాపురం ఏప్రిల్ 29(నేటి దాత్రి ):-

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జక్కుల వారి విధికి చెందిన వాసం రవికిరణ్ (40) తండ్రి కన్నయ్య (లేటు ), కులం కోయ, వృత్తి మిషన్ భగీరథ వాటర్ వాల్ ఆపరేటర్ గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఇంట్లో నే ఉంటూ మిషన్ భగీరథ నీళ్లు వదులుతూ ఉండేవాడు.ఐదు రోజుల క్రితం గురువారం నాడు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయలు దేరి మిషన్ భగీరథ నీళ్లు వదలి వస్తానని అతని తల్లి అయినా వాసం సాలమ్మ తో చెప్పి తన మోటార్ సైకిల్ తీసుకోని దేరాడు. తన కొడుకు ఇంటికి రాక పోయేసరికి తల్లి వాసం సాలమ్మ అన్ని చోట్ల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించక పోవడం తో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు పిర్యాదు చేసింది. స్థానిక ఎస్సై కె తిరుపతి రావు వాసం సాలమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా వాసం రవికిరణ్ తన ఆరోగ్యం బాగాలేనప్పటికి మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమీ లో ఇంటి నుండి బయటకు వెళ్లడం వలన వడదెబ్బకు గురై అస్వస్థత చెంది వి. ఆర్. కె పురం గ్రామ శివారు లోని పాలెం వాగు ప్రాజెక్టు కాలువ సమీపంలో పడి పోయినట్లు తెల్సింది. ఆ ప్రదేశం నిర్మాన్యూస్య ప్రదేశమై ఎవరు చూడకపోవడం తో మృతుడు మరణించినట్లు గా ప్రాథమిక విచారణ లో తెలుస్తుందని అన్నారు. మృత దేహాన్ని తన తల్లి వాసం సాలమ్మ గుర్తించగా ఆమె వాంఘ్ములం మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న.!

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను ఏ నోటిస్ లు లేకుండా తొలగింపు అనేది అక్రమం,

వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం*

నేటి ధాత్రి భద్రాచలం

చర్ల మండలం మొగల్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటిస్ లు లేకుండా వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది* వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మార్వో శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్* మాట్లాడుతూ ఏ ఆంక్షలు లేకుండా
ఎన్నో నెలలుగా వీరు మొగళ్లపల్లి ర్యాంపులలో పనిచేస్తున్నారు రెక్కాడితే డొక్కాడని కుటుంబం నుంచి ఆదివాసి గ్రామస్తులు పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు భారత రాజ్యాంగం 1/70, పిసా యాక్ట్ ను అమలులో ఉన్న అన్యం పుణ్యం తెలవని అమాయకులు వారి హక్కులను మరచిపోయి పొట్టకూటి కోసం పని చేస్తుంటే ఆదివాసి చట్టాలను కూడా అతిక్రమిస్తూ ఇసుక మాఫియా యాజమాన్యం పెత్తనం చలాయిస్తుందని వారన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా వారు చేసిన తప్పేందో తెలియకుండా వారిని విధుల్లోంచి తొలగించడం సరైనది కాదని తక్షణమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ యువకులను ఇసుక ర్యాంపు పనిలోకి తీసుకోవాలని లేనిచో దశల వారి ఆందోళన చేస్తామని పై అధికారులను కలుస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పవన్ వి నాగరాజు మునేశ్వరరావు సంటి వాదం సుధాకర్ అశోక్ సత్యనారాయణ నరేష్ పవన్ రాము తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version