ఉన్నత విద్యకు ప్రాథమిక విద్య పునాది
ప్రాథమిక పాఠశాలల పట్ల వివక్ష తగదు
ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్నీ నియమించాలి
ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం ను నియమించాలి
నడికూడ,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలనీ పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎందుకంటే బడిబాట తర్వాత నమోదు అయిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాల్సిన ఉపాధ్యాయుల సర్దు బాటును బడి బాటకు ముందు ఎలా చేస్తారు.
ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి అని,అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరే ఉపాధ్యాయులు పద్దెనిమిది సబ్జెక్టులు ఎలా బోధించడం సాధ్యమవుతుంది.
ప్రైమరీలో సబ్జెక్టులు లేదనే భావన అధికారుల్లో ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించాలి.అదే ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు లేకున్నా సబ్జెక్టు ఒక టీచర్ ను నియమిస్తారు.
ఇక్కడే అర్థమవుతుంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పట్ల ఉన్న వివక్షత.
ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో అదే విధంగా ఉన్నత విద్యకు కూడ ప్రాథమిక విద్య అంతే ముఖ్యమని ప్రభుత్వం తెలుసుకోవాలి.
అప్పుడే ప్రాథమిక విద్య మెరుగై ఉన్నత విద్యలో సత్ఫలితాలను అందిస్తుంది.
ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం నిర్వహించడానికి, గుణాత్మకమైన విద్య అందించడానికి ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయులు, తరగతికి గదికి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించకుండా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు పేరుతో ఏకపక్షంగా తీసేస్తే ఆ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం మరియు గుణాత్మక విద్య అనేది ఎలా సాధ్యమవుతుంది.
ఒకవేళ ఈ ప్రజా ప్రభుత్వం కనుక బడుగు బలహీన వర్గాల పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి.
ఇప్పుడిప్పుడే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపిస్తున్న సమయంలో మీరు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టే విధంగా తీసుకొచ్చిన ఈ ఉత్తర్వులను వేంటనే రద్దు చేయాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.
మిగులు టీచర్లున్నట్లు జూన్ మాసంలోనే ఎలా తెలుస్తుంది.
చాలా ప్రాంతాల్లో సర్కారు బడుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తున్నారు.
మేం ఇంటికి తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నింటే,అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు.
పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లులేకపోతే ఎలా..?
జులై, ఆగస్టు మాసాల్లో చేయాల్సిన సర్దుబాటును జూన్లోనే చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందస్తు బడిబాట మరియు రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మకమైన విద్య,ఆంగ్ల భాషలో బోధనతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసానిచ్చి పాఠశాలలో విద్యార్థులను నమోదు చేయిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం అనేది ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్మ వైఖరికి నిదర్శనంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
ఈ అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు వెనుకకు తీసుకోవాలని నడికూడ మండల శాఖ పక్షాన కోరుచున్నాము.
బడిబాట ముగిసిన తర్వాత జులై మాసంలో సర్దుబాటు చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు.