కరువు నేలన మహాఘట్టం ఆవిష్కరణ

https://epaper.netidhatri.com/

పాలమూరు కరువు తీర్చనున్న జలరాశులు
తెలంగాణ తల్లికి కడుపారా సాగునీరు!
రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి ‘‘గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేందర్‌ రావు’’ తో ‘‘రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రారంభం’’ సందర్భంగా చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే

`పారే నీరు ఒడిసి పట్టిన అపర భగీరధుడు కేసిఆర్‌.

`ఎడారి లాంటి తెలంగాణలో సాగు సంపదలు.

`తెలంగాణ గొంతు తడిపిన జలధాత.

`సాగు నీటి కష్టం తీర్చిన రైతు బాంధవుడు.

`నాడు కన్నీటి చుక్కలు కార్చి…తెలంగాణ తెచ్చి. ప్రాజెక్టులు కట్టి.

`తెలంగాణ సస్యశ్యామలం చేసిన దేవుడు.

`నీటి పరవళ్లతో మురుస్తున్న పాలమూరు పల్లెలు.

`పలుగురాళ్ల పాలమూరులో పండుతున్న పసిడి పంటలు

`పదేళ్ల కింద వలసలు.

`ఇప్పుడు సాగు సిరులు.

`ఎండిన బీడుల స్థానంలో పచ్చని పైర్లు.

`ఎటు చూసినా పచ్చిని పొలాలు.

`కోనసీమలా మారనున్న పాలమూరు

`పాలమూరు.. రంగారెడ్డితో జాడలేకుండా పోయిన కరువు ఛాయలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

https://epaper.netidhatri.com/

పలుగు రాళ్ల పాలమూరులో నీటి పరవళ్లు, సాగు మడులు, బంగారు పంటలు, రైతు మోములో చిరునవ్వులు చూస్తామని కలలో కూడా అనుకోలేదు. కరువు నేలకు గంగమ్మను తెచ్చి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేసిన అపర భగీరధడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఒకనాడు కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా మంచినీరు లేక గోస పడిన కాలం. చుక్క నీరు దొరక్క అల్లాడిన తెలంగాణం. పొలాల గొంతు ఎండి ఎడారిగా మారి, కరువు కాటుతో అల్లాడి, ఊళ్లకు ఊళ్లు మాయమైన కాలం. గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం కడువలు నెత్తిన పెట్టుకొని ఆడబిడ్డలు అరిగోస పడ్డ కాలం. చెరువుల్లో నీరు లేక, బావుల్లో చుక్క కానరాని కాలం చూసింది తెలంగాణ. గజాల కొద్ధి గంపెడాశతో బావులు తవ్వినా, వేల అడుగులు బోర్లు వేసిన దుబ్బతప్ప నీటి చుక్క చూడని తెలంగాణ నిన్న. బతకలేక బతుకు జీవుడా? అంటూ పొట్టు చేతపట్టుకొని ఊరొదిలి బొంబాయిలో కూలీలుగా బతికిన పల్లె తెలంగాణ. చెప్పుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు సుడులు తిరుగుతుంటాయి. ఇదంతా పదేళ్ల కింద ముచ్చట. ఇప్పుడు పాలమూరులో పలుగు రాళ్లు పోయాయి. పంటల మాగాణాలు వచ్చాయి. అరవైఏళ్ల పాటు పరాయి పాలనలో గోసపడ్డ తెలంగాణ, సాగు నీటి రంగంలో విప్లవం చూస్తోంది. కేసిఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపకల్పన జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదం. పల్లెదనం. పల్లెలన్నీ బంగారు మయం. కోటిన్నర ఎకరాల సాగుమయం. పచ్చని పంటల మాగాణ నా తెలంగాణ అని ప్రతి ఒక్కరూ కీర్తించుకునేలా మారిపోయింది. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు పడ్డాయి. కాళేశ్వరం పూర్తితో చెరువులు నిండుకుండలౌతున్నాయి. మల్లన్న సాగర్‌ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేయబడ్డాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తయింది. మొత్తం తెలంగాణ సంబరపడుతోంది. అంటున్న విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న విశేషాలు..ఆయన మాటల్లోనే…
గతంలో ఎక్కడ చూసినా ఎండిన బీడులే.
.ఇప్పుడు ఎక్కడ చూసిన పొల మడులే. మడుల నిండా నీళ్లే…ఇరవై నాలుగు గంటలం కరంటే…అటు పచ్చని పైర్లు, ఇటు ఎల్లవోస్తున్న బోర్లు, బావులు…తెలంగాణ మొత్తం జలకళలతో అలరాలుతోంది. గతంలో తెలంగాణ నాయకులు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేవారు. ఎన్నికలు ఓట్లు, సీట్లు, పదవులు తప్ప, ప్రజల సమస్యలు పట్టలేదు. తెలంగాణ ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి నల్లగొండలో ప్రజలు ఫ్లోరైడ్‌ బారిన పడి తరాలు నాశనమౌతున్నా కనికరించలేదు. మంచినీటికి దిక్కలేదు. మూసీ నది మురికి నీళ్లే మీకు వరం అన్నట్లుగా అందించారు. అలా కూడా తెలంగాణ ప్రజలను అవమానించారు. అనారోగ్యాల పాలు చేశారు. నోరుండి మాట్లాడలేని, తలుండి ఎత్తుకోలేని, నాలుక వుండి కదిలించలేని, చేతుండి నిలదీయలేని కాంగ్రెస్‌ నాయకుల మూలంగా నల్లగొండ నాశనమైంది. కేసిఆర్‌ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది. ఇప్పుడు నల్లగొండ ఒక గొప్ప నేలగా విరాజిల్లుతోంది. మంచినీరందుతోంది. సాగు నీరందుతోంది. పాలమూరు రంగారెడ్డితో నల్లగొండ మొత్తం పచ్చని మాగాణమౌతుంది. తెలంగాణ సాధించిన తర్వాత భవిష్యత్‌ తెలంగాణ ఎలా వుండాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో కలలో రూపంలో పదిలం చేసుకున్నాడు. అలా తయారు చేసుకున్న బ్లూ ప్రింట్‌ తో అందమైన తెలంగాణను ఆవిష్కరిస్తున్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రగతిని పట్టాలెక్కించారు. ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి మన కళ్ల ముందు నిలుపుతున్నారు. అటు అభివృద్ది ఇటు, సంక్షేమం ఏ కాలంలో సరిసమానంగా అందిస్తూ ప్రతి ఇంటికి పెద్దకొడుయ్యాడు. తెలంగాణ పాలిట దేవుడయ్యారు. తెలంగాన జాతికి పితగా కీర్తించబడుతున్నారు. ఎందుకంటే జలదృష్యంతో ప్రాస్ధానం మొదలు పెట్టి, ఉద్యమం చేపట్టి, పోరాటం సాగిం చి, తెలంగాణ సాధించి, సుజల దృష్యం ఆవిష్కరించి, నీటి చుక్క కోసం పరితపించిన తెలంగాణను నీటి పరవళ్లతో తరింపజేస్తున్నాడు. కేసిఆర్‌ అనే పదమే ఒక వేదం. మూడక్షరాల నామం…తెలంగాణ పాలిట జపం. తెలంగాణ సాధనకు ఆ పదమే భీజమైంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకలను ఏకం చేసింది. ఆ పేరే తెలంగాణ తెచ్చింది. గోసపడిన తెలంగాణ తల రాత మార్చింది. తెలంగాణ బతుకులో వెలుగులు నింపింది. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది. దటీజ్‌ కేసిఆర్‌ అంటూ దేశమంతా కొనియాడుతోంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతికి అంకితం చేసే తరుణం వచ్చేసింది.
ఆ మహా ఘట్టం ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతుల మీదుగా జరగనున్నది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని బూత్‌పూర్‌ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2015లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పనులను ప్రారంభించారు. జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అవసరమైన సారు, తాగు నీటి అవసరాలు తీర్చనున్నది. ఈ ప్రాజెక్టు అదనపు అవసరాలు హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని ఏల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా లక్ష్మిదేవిపల్లికి పంపిస్తారు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. సముద్ర మట్టానికి మూడుందల అడుగుల ఎత్తున వున్న శ్రీశైలం నుంచి ఐదు అంచెలుగా సుమారు 600 అడుగుల ఎత్తున లక్ష్మిదేవి జలాశయానికి తరలిస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఐదు లిఫ్టులు, ఆరు జలాశయాలు నిర్మాణం జరిగింది. ఇటీవలే డ్రైరన్‌ కూడా విజయవంతంగా కొనసాగింది. గుట్టలను కట్టలుగా మార్చి, చెరువులను నిర్మించిన కాకతీయకాలపు చరిత్రను ఆధారంగా రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ఆయ గుట్టలకున్న విశిష్టతే కాదు, అక్కడ కొలువై వున్న దేవుళ్ల పేరుతోనే రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. నార్లాపూర్‌ వద్ద అంజనగిరి జలాశయం నిర్మించారు. ఏదుల వద్ద వీరంజనేయ జలాశయం. వట్టెం వద్ద వెంకటాద్రి జలాశయం. కరివెన వద్ద కురుమూర్తి జలాశయాలు నిర్మాణంచేశారు. అంజనగిరి జలాశయం కట్ట పొడవు ఏడు కిలోమీటర్ల పరిధిలో చేపట్టారు. వీరంజనేయ జలాశయం సుమారు 8 కిలోమీటర్లు, వెంకటాద్రి జలాశయం 15కిలోమీటర్లు, కురుమూర్తి జలాశయం 14 కిలోమీటర్లు నిర్మాణం జరిగింది. పాలమూరు రంగారెడ్డి మూలంగా మొత్తం 1226 గ్రామాలకు తాగు నీరు, సాగు నీరు అందనున్నది. పైగా పరిశ్రమలకు అదనం. మూడు జిల్లాలో 12,30,000 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారాసాగు నీరు అందనున్నది. కొండలనే పెట్టని గోడలుగా నిర్మాణం చేయడం మూలంగా జలాశయాల నిర్మాణానికి ఖర్చు తగ్గింది. కొండలపై పడిన నీరు కూడా నేరుగా జలశయాలలోకి వచ్చి చేరుతుంది. వర్షపు నీరు చుక్క కూడా వృధా పోకుండా కాపాడినట్లౌవుంది. జంట జలాశయాలు ప్రత్యేకం. ఇప్పటికే కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లో భాగంగా 345 మీటర్ల ఎత్తున నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్‌ ను ఆనుకొనే సమాంతరంగా నార్లాపూర్‌లో అంజనగిరి నిర్మాణం జరిగింది. ఈ రెండిరటినీ అనుసంధానం చేసి, ఒకే స్ధాయిలో వుండేలా నిర్మాణం చేయడం తెలంగాణ ఇంజనీరింగ్‌ ప్రతిభకు నిదర్శనం. అంతే కాదు కల్వకుర్తి లిఫ్టులతో పని లేకుండానే ఎల్లూరు రిజర్వాయర్‌ నింపేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా వెంకటాద్రి, కురుమూర్తి రిజర్వాయర్లను కూడా మరో జంట రిజర్వాయర్లుగా పిలుస్తున్నారు. అంతే కాకుండా ఈ రిజర్వాయర్ల మద్య అనేక ఐలాండ్స్‌ కూడా వున్నాయి. అవి భవిష్యత్తులో పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతాయి. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ నెల 16న బాహుబలి మోటార్లను ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!