అధికారులపై జరిమానా విధిస్తూ ఎన్జిటి కోర్టు తీర్పు
ఉత్తర్వులకు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక క్వారీలను నిలిపివేయాలని, అధికారుల పై జరిమానా విధిస్తూ ఇచ్చిన ఎన్జిటి కోర్టు తీర్పు స్వాగతిస్తూ ఉత్తర్వులకు హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి సమ్మిరెడ్డి విజ్ఞప్తి చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణా నిలుపుదల కోసం ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేక మంది రైతుల పైన యువకుల పైన అక్రమ కేసులు బనాయించి కరీంనగర్ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, అవినీతి అధికారులైన కొంత మంది పోలీసులు కలిసి నానా రకాలుగా రైతులను ప్రజలను వేధింపు చేసినారనీ అన్నారు. ఎన్ని వేధింపుల గురించి చేసిన నిర్విరామంగా ఇసుక మాఫియా పై పోరాటం చేసిన సుధాకర్ ని సన్మానం చేయడం జరిగిందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానా వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందింపజేయాల్సిందిగా అప్పటి రైతుల పైన పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వెంటనే తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేసినారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి ఇసుక అక్రమ రవాణా, దోపిడి పైన అక్రమ కాంట్రాక్టర్ విధానం పైన పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో పలు సందర్భాల్లో హుజురాబాద్ కు వచ్చిన వేళల హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్ల పైన ప్రభుత్వాధికారుల పైన ప్రభుత్వ ఆరోవర్ యాక్టును ఉపయోగించి అక్రమంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతు దోచుకున్న వెయ్యి కోట్లను రికవరీ చేయవలసిందిగా.. చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందనీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వారితోపాటు మానేరు పరిరక్షణ సమితి నాయకులు కంకణాల సురేందర్ రెడ్డి, ఎండి సలీం, మైస మహేందర్ తదితరులు పాల్గొన్నారు.