
Maha Garjana: Manda Krishna
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల సన్నాహక సదస్సు కార్యక్రమం
◆:- పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆదివారము రాత్రి ఎన్ కన్వెన్షన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దలు, గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి వికలాంగుల సన్నాహక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడానికి ఎమ్మార్పీఎస్ ఏ కారణం అని చెప్పడం జరిగింది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు పెంచాలని పోరాటం చేసింది కూడా ఎమ్మార్పీఎస్ ఏ అని కూడా వారు సభలో చెప్పడం జరిగింది, అలాగే చిన్నపిల్లల గుండె సమస్యలకి ఉచిత వైద్యం చేయించాలని కూడా ఎమ్మార్పీఎస్ ఏ పోరాటం చేసిందని మరియు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 200 నాటి నుండి 2000 వరకు పెరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేసింది అని మరియు 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 4000 నుండి 6000 వరకు పెంచడం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 9 వ తేదీన మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత జ్యోతి పండాల్ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ ద్వారా వివిధ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులైన గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ అబ్రహం మాదిగ మరియు మండల అధ్యక్షులకి, వారి టీమ్ అందరికీ మరియు రాయికోటి నరసింహులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంఆర్పిఎస్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు,