మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది
మంచిర్యాల నేటి దాత్రి
మంచిర్యాల భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లు
1.) ఈ పి ఎఫ్- 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనె పెంచాలి. మరియు చివరకు జీతంలో 50% + డి ఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి.
2.) ఈ పి ఎఫ్ జీత పరిమితిని 15,000/- నుండి 30,000/- పెంచాలి.
ఈ ఎస్ ఐ జీతం పరిమితిని 21,000/- నుంచి 42,000/- పెంచాలి.
3.) ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలి.
4.) బీమా ఆర్థిక రంగంలో 100% విదేశీ పెట్టుబడులను నిషేధించాలి.
5.) స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం మరియు సామాజిక భద్రత కల్పించాలి.
6.) అసంఘటిత కార్మిక రంగానికి బోర్డ్ లను ఏర్పాటు చేసి వాటికి తగినన నిధులను కేటాయించాలి.
7) మినిమం వేజెస్ 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్2016 నుండి పెండింగ్లో ఉన్న సమస్య 2012లో డిమాండ్ చేసిన విధంగా బిఎంఎస్ మినిమం వేజెస్ 25 వేల రూపాయలు ప్రకటించాలి
8) కార్మిక బోర్డులో ఉన్న వెయ్యి నాలుగు కోట్లు ఇతర శాఖలకు మళ్లించిన డబ్బులను తిరిగి బోర్డులో జమపరిచి కార్మికుల డెత్ క్లేములు మిగతా సౌకర్యల కొరకు వినియోగించాలి
సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్ధూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించడం జరిగింది
కార్మికుల తీవ్ర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రాష్ట్రంలోని జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ సంబదిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి కి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.
భారతీయ మజ్దూర్ సాంగ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
వీరిలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్ మరియు సింగరేణి ఏ బి కె ఎం ఎస్ నాయకులు కె శ్రీనివాస్ మరియు మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ పెయింటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సంగెం లక్ష్మణ్ ,వేల్పుల స్వామి పెయింటర్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కార్యదర్శి , ఆఫీస్ సెక్రటరీ మహానంద్ ప్రభాకర్, మరియు ఎస్ సి సి ఎల్ కన్వీనర్ ,మిట్టపెల్లి మొగిలి బిఎంఎస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో బిఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగినది