మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టి 24 గంటలు గడిచిన మృతుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు.