వీణవంక,( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ లో ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది కాబట్టి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ… మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వాలు ఈరోజు నుండి ఇవ్వడం జరుగుతుందని అలాగే మండలంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక వాదులు అగ్రకులాల పార్టీలను వదిలేసి స్వచ్ఛందంగా ధర్మ సమాజ్ పార్టీ లో చేరాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి రాకేష్,మండల కమిటీ సభ్యులు సదానందం,పృధ్వీరాజ్,రాకేష్, బాలు,శంకర్,వినయ్,నవీన్, మణికంఠ,అజయ్,రాజు తదితరులు పాల్గొన్నారు.