పరకాల నేటిధాత్రి
పరకాల మండల కేంద్రంలో స్టడీ హెల్త్ అబుజర్వేషన్ టూర్ లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా హాన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్ మాట్లాడుతూ హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతగా లేకపోవడం,శానిటేషన్ సిబ్బంది కొరత వల్ల ఎప్పటికప్పుడు శుభ్రంగా లేకపోవడం,బెడ్స్ కొరత వల్ల ఒక బెడ్ కు ఇద్దరు రోగులు ఉండటం,ఎమర్జెన్సీ సర్వీస్ లేక పోవటం,చాలా రకాల సమస్యలకు పుట్టినిల్లుగా ప్రభుత్వ హాస్పిటల్ ఉండటం చాలా బాధాకరమని వెంటనే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సౌకర్యలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు నాగ మహారాజ్,ప్రధాన కార్యదర్శి రవి మహారాజ్ సలీం పాషా,రత్నాకర్ మహారాజ్,తిరుపతి,ప్రశాంత్ బాలు లు పాల్గొన్నారు.