గడువులోగా ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.

పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి ధరణి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కారం చేయాలని పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ అన్నారు.మండలంలో 122 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయన్నారు. తాసిల్దార్ వీటిని పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారునికి సేతు వారు చూపించి కారణం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుభాషిని డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *