
Tribal Welfare Hostel.
చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు