గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ జిల్లా గణపురం మండలం నియోజవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి నా ప్రధాన, ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఈజీఎస్ నిధులతో మూడు కోట్ల సిసి రోడ్డు, డి ఎం ఎఫ్ టి 25 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, డి ఎం ఎఫ్ టి నిధులతో 85 లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ మరియు డీఎం ఎఫ్.టి నిధులతో 9 లక్షల 90 వేల రూపాయలతో సిసి రోడ్డు జరిగే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నరేష్, డి ఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అరుంధతి, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ,మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి చోట మియా, ఎంపిటిసి కాలియా సాగర్ ,గ్రామ మాజీ సర్పంచులు గండ్ర ఆగమరావు, మునుకుంట్ల సంగయ్య, మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, గణప సముద్రం మత్స్య శాఖ చైర్మన్ మునిగాల రమేష్ మండల నాయకులు చింత రెడ్డి సమ్మిరెడ్డి, తాళ్ల పెళ్లి భాస్కరరావు, మాల భద్రయ్య, సుంకరి సుధాకర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున్, ఓద్దులే అశోక్ రెడ్డి, ఉడుత రవీందర్, దూడపాక దుర్గయ్య, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *