రుణమాఫీ రాణి రైతుల వివరాలు సేకరించాలి.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్.
జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో రామాయ oపేట డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల నమోదు కార్యక్రమం రైతుబంధు రైతు బీమా రుణమాఫీ ఎరువుల లభ్యత వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పంటల నమోదు కార్యక్రమం పూర్తయిందని అదేవిధంగా రైతు బీమా క్లైమ్ పరిష్కారం త్వరగా అయ్యేవిధంగా సంబంధిత పత్రాలను అధికారులకు పంపించాలని ఆదేశించారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రుణమాఫీ కి సంబంధించి రైతుల యొక్క విన్నపాలను సేకరించి బ్యాంకు అధికారులకు అందించాలని అదేవిధంగా రుణమాఫీ పొందిన రైతులు జాబితాలను బ్యాంకు అధికారుల నుండి సేకరించి ఎవరైనా రైతులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోనట్టయితే, రెన్యువల్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు వ్యవసాయ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ రామాయంపేట నిజాంపేట చేగుంట నార్సింగి సంబంధించిన మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!