New Terror Links in Delhi Car Blast
ఢిల్లీ కారు బాంబు పేలుడు.. తుర్కియేలో పర్యటించిన ఉగ్ర డాక్టర్లు..
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
పంజాబ్ రాష్ట్రం, లుథియానాలోని ఢిల్లీ-అమృత్సర్ హైవేపై ఇద్దరు ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. లాడోవాల్ టోల్ ప్లాజా వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. టోల్ ప్లాజా సమీపంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు గాయపడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఉగ్రవాదులిద్దరికీ సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
