Deeksha Divas Celebrations in Sangareddy
దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
◆:- జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,ఉద్యమకారులు ….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి బెవెరేజస్ చైర్మన్ దేవీప్రసాద్,మాజి జిల్లా పరిషద్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే లు భూపాల్ రెడ్డి,చంటి క్రాంతి కిరణ్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ,కేసీఆర్ గారి చిత్ర పటానికి పాల అభిషేకం నిర్వహించారు అనంతరం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఫోటో గ్యాలరీని వీక్షించి అనంతరం వారు చేసిన త్యాగాలను మరియు రాష్ట్రం సాధించిన తర్వాత ప్రగతిని నాయకులతో కలిసి వీక్షించారు అనంతరం ఎమ్మెల్యే ,చైర్మన్ గార్లు మాట్లాడుతూ.. ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో – తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసి నేటికి 16 ఏండ్లు గడిచాయని అన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన ప్రాణ త్యాగ ప్రయత్నం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి, ప్రగతి సాధించిందన్నారు. టి బీజేపీ, టి కాంగ్రెస్ లకు పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు కేసీఆర్ ఆనాడు ఉద్యమం ప్రారభించకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరైనా గుర్తుపట్టేవారా అని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాలకల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నీల వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్, నాయకులు నాగన్న పటేల్ వెంకట్,నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్,రాజు పటేల్,మారుతి,నరేష్ రెడ్డి,అలీ, జుబేర్,జాకీర్, లవన్, మధు,తదితరులు పాల్గొన్నారు..
