ఉపాధి హామీ కూలి మృతి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలి మహిళ గుండెపోటుతో మృతి చెందిందని తోటి ఉపాధి కూలీలు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె ఉపాధి హామీ కూలి వెళ్లడంతో పని స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.