జహీరాబాద్ కార్యకర్తల నిర్ణయం మేరకే డిసిసి అధ్యక్ష ఎన్నిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో AICC అబ్జర్వర్ జరిత మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయమే అంతిమమని తెలిపారు. అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
