
Dasari Srinivas to Contest from Kishtampet MPTC
కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.