వెలుగులో చీకటి బాగోతం.

Darkness Darkness

 

వెలుగులో…చీకటి బాగోతం…!

నిలువునా ముంచేస్తున్న మహిళా సంఘాల సిఏలు

మహిళా సంఘాలు ఆదమరిస్తే…. తస్మాత్ జాగ్రత్త…?

కేసముద్రం నేటి ధాత్రి:

కేసముద్రం మండలంలోని మహిళా సాధికార మండల సమాఖ్య కార్యాలయంలో లోని సిఐలు గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం ప్రదర్శిస్తూ మహిళా సంఘాల మహిళలను అడ్డగోలుగా లక్షల రూపాయలు దోచుకు తింటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలం లోని కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన మహిళ సంఘాల రోదన అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళితే కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన రెండు ఒక మహిళ స్వయం సహాయక సంఘాల బ్యాంకు నుండి లోను పొందారు కానీ అట్టిలోనూ డబ్బులు సంఘంలోని మహిళా సభ్యులకు పంచకుండా అట్టి మొత్తం డబ్బులను తన సొంత అవసరాలకు స్వాహా చేశాడు ఇట్టి విషయమై పలుమార్లు సంఘం సభ్యులు నిలదీయగా రేపిస్తామాపిస్తా అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు చివరకు విసిగి వేసాగిన మహిళా సంఘం సభ్యులు గట్టిగా నిలదీయడంతో మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అట్టి డబ్బులు నేను చెల్లించను మీకు దిక్కున కాడ చెప్పుకోండి ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ మహిళల పట్ల దుర్భాష వాడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని సంఘం సభ్యులు ఆపోతున్నారు చివరకు గురువారం నాడు ఆ సంఘాల మహిళలు వెలుగు ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది ఇంత చేసినా కూడా సంబంధింత పైగా అధికారులకు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు ఆ అధికారులే ఎవరికీ చెప్పకండి అంటూ గుట్టు చప్పుడు కాకుండా ఇట్టి బాగోతాన్ని వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో ఇలాంటి మహిళా సంఘాల చేతివాటం ప్రదర్శించి మహిళా సంఘాలలోని డబ్బులను లక్షలకు లక్షలు కాజేసిన సంఘటనలు జరిగాయని పలువురు భావిస్తున్నారు. ఇంత చీకటి కుంభకోణాలు జరుగుతున్న సీఎంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనక అంతర్యం ఏమిటో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా సంబంధిత వెలుగు కార్యాలయ అధికారులు స్పందించి బాధ్యులైన అధికారులను అలాగే ఇట్టి బాగోతానికి సూత్రధారి అయిన అతన్ని ఉద్యోగం నుండి తొలగించి అతని నుండి అట్టి మొత్తాన్ని కాబట్టి మహిళా సంఘాలకు ఇవ్వవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!