డేంజర్ మూలమలుపులు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

>> 10 కిలో మీటర్లు ఎనిమిది మూలమలుపులు

» మూలమలుపుల వద్ద పెరిగిన పిచ్చిమొక్కలు

» సూచిక బోర్డులు కరువు

జహీరాబాద్ నేటి ధాత్రి

ఝరాసంగం : ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే… అడుగడుగునా మాలమాలుపులు, ఆపై రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపోవడం తో ఎప్పుడూ ప్రమాదం సంభవిస్తుందోనన్నా భయాందోళనకు వాహన చోదకులు గురవుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాల్సిన సంబందిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన మం డల కేంద్రమైన ఝరాసంగం నుంచి క్రిష్ణాపూర్ గ్రామం వరకు 10 కిలో మీటర్లు 8 మూల మాలుపులు దర్శనమిస్తాయి. రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపో వడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జ రుగుతున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు తరుచు మూల మాలుపుల వద్ద ప్రమా దాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు సూచిక బోర్డులు నెలకోల్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహన చోదకులు వాపోతున్నారు.

ఈ రోడ్డుపై ప్రతి రోజూ రద్దీ…

ఈ రోడ్డు గుండా ప్రతి రోజు ఝరాసంగం, రాయికోడ్ మండలాలకు చెందిన ప్ర జ లు వివిధ పనుల నిమిత్తం జహీరాబాద్ పట్టణంకు వెళ్ళుతుంటారు. అంతే కా కుం డా ఝరాసంగంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దర్శనం కోసం కర్ణాటక, మహా రాష్ట్ర భక్తులు ఈ రోడ్డు వెంటే ప్రయాణిస్తారు. కానీ సంబంధిత అధికారులు మూల మాలుపుల వద్ద సూచీక బోర్డు లు, పిచ్చిమొక్కలు తొలగించకపోవడంతో ప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన వారు ఆస్పత్రి పాలవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!