దళిత బండ్ల జాడెక్కడ!?
-దళిత బంధు కార్లు తిరుగుతున్నదెక్కడ?
-లబ్ధి దారులకు అందినవి ఎన్ని?
-అందకుండానే దళారుల చేతుల్లోకి వెళ్లినవి ఎన్ని?
-అన్ని జిల్లాలకు అందిన 36 వేల యూనిట్లలో కార్లెన్ని?
-వేలాది వాహనాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి!
-దళిత బంధును నీరు గార్చిన వారెవరు?
-దళిత బండ్లు ఆంద్రాలో ఎలా తిరుగుతున్నాయి!
-దళిత బండ్లు అమ్మడానికి, కొనడానికి వీలు లేదు!
-లబ్ధి దారుల చేతుల్లోకి రాకుండానే రాష్ట్రం ఎలా దాటి పోయాయి?
-దళిత బంధు కార్లు ప్రతి ఏటా ఫిట్ నెస్కు రావాలి!
-ఆర్టీవో అధికారులు ఏం చేస్తున్నారు!
-దళిత బంధు అందినా దళితులు ఎందుకు పేదలుగానే మిగిలారు?
-దళిత బంధు పక్కదారి పట్టకుండా దళిత అధికారులకు బాధ్యతలు అప్పగించారు!
-అయినా దళిత బంధు కార్లు ఎలా మాయమయ్యాయి!
-దళితులను మోసం చేసిన వారిలో దళిత అధికారుల పాత్ర ఎంత?
-దళితులను మోసం చేసిన కార్ల డీలర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు!
-కారు కళ్లారా చూడకుండానే వదులుకున్న దళితులెందరు?
-కార్ల ముందు ఫోటోలు దిగినా చేతికి రాని వాళ్లు ఎంత మంది?
-ప్రతి దళిత బంధు కారుపై పథకం స్టిక్కర్లు వుండాలి.
-తెలంగాణ దళిత బంధు కార్లు తెలంగాణలోనే వుండాలి.
-ఆంద్రాలో మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు!
-కార్లు రాష్ట్రం దాటించిన ఆర్టీఐ అధికారులెవరు?
-దళిత బంధు మొత్తానికి నీరు గార్చిందెవరు?
-వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరలేదెందుకు?
-దళితులను తప్పు దోవ పట్టించిందెవరు?
-అమాయక దళితులను నిండా ముంచిందెవరు?
-దళిత బంధు యూనిట్లు 47 రకాలు!
-అందులో కార్లు ఒక్క అంశమే!
-మిగతా యూనిట్లపై వరుస కథనాలు మీ నేటిధాత్రి లో..
…………………………
దళితులకు దక్కకుండా పోయిన యూనిట్లు రికవరీ చేయండి?
-మోసపోయిన దళితులకు మళ్ళీ ఆ యూనిట్లు అప్పగించండి
-దళితుల జీవితాలలో వెలుగులు నింపండి
-ఇందిరమ్మ రాజ్యానికి అసలైన నిర్వచనం చెప్పండి
-దళితుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని మరోసారి నిరూపించండి
-దళిత బంధును మింగిన రాబందుల నుంచి కక్కించండి
-దళితుల మేలు కాంగ్రెస్ వల్లనే సాధ్యమని చాటి చెప్పండి
హైదరాబాద్,నేటిధాత్రి:
దళిత బంధు పదకంలో మద్య దళారులు చేరి, రాబంధులై దోచుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సొమ్ము చేరకుండా చేశారు. వారికి అందాల్సిన యూనిట్లను అందకుండా, ఎంతో కొంత చేతిలో పెట్టి వాటిని తీసుకెళ్లారు. అలాంటి దళిత బంధు పధకంలో యువకులు అందజేసిన కార్లు ఎక్కుడ. ఆ రెండు సంవత్సరాల కాలంలో దళితులకు అందిన కార్లు ఎన్ని? అందకుండానే దళారుల చేతుల్లోకి వెళ్లినబండ్లు ఎన్ని? తెలంగాణలోని అన్ని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుతోపాటు, అమలు జరిగిన ప్రాంతాల్లో అందిన 36వేల యూనిట్లు ఎక్కడున్నాయి? దళితుల చేతుల్లో ఎన్ని వున్నాయి? దళితుల బలహీనతలను ఆసరాగా చేసుకొని దళారులు తీసుకెళ్లినవి ఎన్ని వున్నాయి? ఈ యూనిట్లలో కార్లు ఎన్ని మంజూరయ్యాయి? డీలర్లనుంచి ఎన్ని కార్లు రోడ్లమీదకు వచ్చాయి? ఎన్ని ఇప్పుడు వారి చేతుల్లో వున్నాయి? ఎన్ని కార్లు దళారులు తీసుకెళ్లారన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ఎందుకంటే దళితులకు దళిత బందు పధకం కింద ఇచ్చిన ఏ యూనిట్నైనా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఆ యూనిట్లను ఎవరూ కొనుగోలు చేయకూడదు. ఈ సంగతి తెలిసినా ఎలా కొనుక్కున్నారు. ఎలా తీసుకెళ్లిపోయారు? ఇంకా విచిత్రమేమిటంటే లబ్ధిదారులు కనీసం చూడకుండా వెళ్లిపోయిన కార్లు వేలల్లో వున్నాయి. లబ్దిదారులు చేతుల్లోకి రాకుండానే వెళ్లిపోయినకార్లు వేలల్లో వున్నాయి. ఇలా దళిత బందు పేరు మీద ఇచ్చిన కార్లు కేవలం టాక్సి ప్లేట్తో నడుపుకోవాల్సి వుంటుంది. అలాంటి వాహానాలు ప్రతి ఏటా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి ఫిట్ నెస్ చెక్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం ఆ కార్ల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన అవసరం వుంటుంది. మరి ఆ వాహనాలు ప్రతి ఏటా వస్తున్నాయా? వాటిని చెక్ చేస్తున్నారా? మళ్లీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా? అన్నది కూడా తెలియాల్సిన వుంది. ఎందుకంటే ఈ కార్లను పొరుగు రాష్ట్రమమైన ఆంద్ర ప్రదేశ్ నుంచి దళారులు వచ్చిన కొనుగోలు చేసుకొని పోయినట్లు సమాచారం వుంది. ఆ కార్లకు దగ్గరుండి ఆర్టీఏ అదికారులు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ కూడా పెద్దఎత్తున గోల్ మాల్ జరిగింది. ముడుపులు తీసుకొని, ప్రభుత్వానికి చెందిన దళిత బంధు కార్లను ఆర్టీయే అదికారులు దగ్గరుండి అప్పగించినట్లు తెలుస్తోంది. సహజంగా ఏ వాహనానికైనా నెంబర్ రావాలంటే వారం సమయం పడుతుంది. కాని దళిత బంధు వాహనాలకు ఒక రోజులోనే నెంబర్ అందించారు. ఇది కూడా దళారులకు బాగా కలిసి వచ్చింది. వారికి సహకరించేందుకు ఆర్టీయే అదికారులకు వెసులుబాటు కల్గింది. అలా ఆర్టీయే అదికారుల కనుసన్నల్లో రాష్ట్రం దాటిన కార్లుకు ఏపిలో కూడా మళ్లీ కొత్త నెంబర్లు జారీ అయినట్లు కూడా చెబుతున్నారు. నిజానికి ఆ కార్లకు ఖచ్చితంగా దళిత బంధు స్టిక్కర్లు వేయాలి. అవి శాశ్వతంగా వుండేలా చూసుకోవాలి. కాని ఎలాంటి స్టిక్కర్లు లేకుండా వాహనాలు అందించి, దళారులకు ఆర్టీయే అదికారులు సహకరించినట్లు అర్దమౌతోంది. అలా దళిత యువతకు అందాల్సిన కార్లన్నీ వెళ్లిపోయాయి. ఇక్కడ జరిగిన మోసం కూడా కొన్ని వేల కోట్లలో జరిగింది. నిజానికి ఏక కాలంలో కొన్ని వేల కార్లు తయారు చేయడం ఏ కంపనీకి సాద్యం కాదు. ఆ సంగతి తెలిసి కూడా కార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతో లబ్ధిదారులను పిలిచి, కార్ల కంపనీలకు చెందిన డీలర్లు కార్లు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని చెప్పి, కొంత చేతిలో పెట్టి, కారు తీసుకున్నట్లు కూడా సంతకాలు చేసుకున్నారు. అలా కూడా దళిత యువతను మోసం చేశారు. ప్రభుత్వం నుంచి చెక్కులునేరుగా డీలర్లకు వెళ్లడం కూడా వారికి కలిసి వచ్చింది. కార్లు అందే అవకాశం వున్న యువత వద్దకు వెళ్లి కారు మెంటేనెన్స్ అంత సులభం కాదు. డ్రైవర్ను పెట్టుకొని, నెల నెల సర్వీసింగులు చేయించుకుంటూ వుండడం అందరి వల్ల సాధ్యం కాదు. సరైన కిరాయిలు దొరక్కపోయినా ప్రతి నెల డ్రైవర్కు జీతాలు ఇవ్వాల్సి వుంటుందని భయపెట్టి, కార్లను కొనుగోలు చేసుకొని వెళ్లిపోయిన వారున్నారు. ఇలా కార్ల లబ్దిదారులని అందరూ కలిసి నిండా ముంచేశారు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే దళితుల అభ్యున్నతి కోసం అమలు చేసిన దళిత బంధు పధకం దళిత అధికారులైతే పకడ్బందీగా అమలు చేస్తారని అప్పటి ప్రభుత్వం నమ్మింది. దళిత బందు అమలు బాద్యత రాష్ట్ర స్దాయి నుంచి జిల్లా స్దాయి వరకు దళిత అదికారులకే బాద్యతలు అప్పగించింది. అయినా ఈ పథకం పక్కదారి పట్టింది. దళితులను దళిత ఉద్యోగులే మోసం చేశారన్నది స్పష్టమైంది. పైగా దళిత బంధు పథకం పక్కదారి పడుతున్న దానిపై అప్పట్లో నేటిధాత్రి కధనాలు రాస్తే ఆ అధికారులు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేఉస్తామని బెదిరించిన సందర్భాలున్నాయి. అంటే దళిత బంధు సక్రమంగా అమలు చేసి, దళితులను లక్షాధికారులను చేయాలని నేటిధాత్రి వార్తలు రాస్తే దళిత అదికారులకు ఇబ్బంది కలిగింది. దళితులకు ఏ మాత్ర నష్టం జరగకుండా చూసుకోవాల్సిన దళిత ఉద్యోగులే అప్పుడు మోసం చేశారన్న ఆరోపణలు కూడా అనేకం వున్నాయి. దళిత బందు పథకం పక్కాగా అమలు చేయాలని దళిత అదికారులకు బాద్యతలు అప్పగించినా కార్లు ఎలా మాయమయ్యాయి? దళిత బంధు పథకంలో ఏ యూనిట్ ఇచ్చినా, ప్రతి నెల వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద వుంది. మరి ఆ పని అధికారులు చేస్తున్నారా? దళితుల వద్ద లేకుండాపోయిన కార్లు వివరాలు సేకరించారా? ఉన్నతాదికారులకు పంపించారా? ప్రభుత్వం మారిపోయిందని చేతులు దులుకున్నారా? ఫైళ్లు పక్కన పడేశారా? అన్నది కూడా తెలియాల్సి వుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ ఫ్రభుత్వం వచ్చినా, వాటి పర్యవేక్షణ వద్దని చెప్పలేదు. కాని అదికారులు మాత్రం వాటి సంగతి వదిలేశారు. దళితులను మోసం చేసిన వారిలో వున్న దళిత అదికారులపాత్ర కూడా ఎంత అన్నది తేలాల్సి వుంది. దళితులను మోసం చేసిన కార్ల డీలర్లను గుర్తించారా? వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం అప్పుడైతే జరగలేదు. దళిత బంధు పక్కదారి పడుతోందని అప్పుడే నేటిదాత్రితో సహా అనేక మీడియాలు చెప్పాయి. కాని అప్పటి ప్రబుత్వం కదల్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజా ప్రభుత్వం దృష్టిపెడితే పక్క దారి పట్టిన వేల కోట్లను కూడా రికవరీ చేయొచ్చు. దళితులకు చెందాల్సిన కార్లను మళ్లీ తిరిగి ఇప్పించొచ్చు. మంజూరైన కార్లను కళ్లారా కూడా చూడకుండా వదులుకున్న దళితయువత బాధను అర్దం చేసుకోండి. కారు ముందు ఫోటో దిగి క్షణం కూడా కారులో కూర్చోకుండానే దళారులకు అప్పగించాల్సి వస్తే వారి మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో తెలుసుకోండి. ప్రభుత్వం కోసం కారు ముందు దిగిన పోటో తప్ప కారు ఇంటి ముందు లేదు. ఉపాధికి పనికి రాలేదు. దళారులు ఇచ్చిన అడ్డికిపావుసేరు పైసలు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఉపాది కోసం దళిత యువత ఎదురుచూడాల్సిన పరిస్దితి వచ్చింది. తెలంగాణ దళిత బంధు కార్లు తెలంగానలోనే వుండాలి. కాని దగ్గరుండి రాష్ట్రం దాటించిన ఆర్టీఏ అధికారులను గుర్తించాల్సిన అవసరం వుంది. లంచాలకు ఆశపడి, ప్రభుత్వ పధకాన్ని నీరు కార్చారు. దళితుల ఆశలను నిర్వీర్యం చేశారు. వారి అమాయకత్వాన్ని వాడుకొని కోట్లకు పగడగలెత్తారు? అసలు దళితబందు పథకం నీరు గారడానికి కారకులు ఎవరు? అన్నది కూడ తేల్చాలి. వేలాదికోట్ల రూపాయలు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరకపోవడానికి కారకులు ఎవరు? పధకం ఎంతో గొప్పది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసింది. కింది స్ధాయికి వచ్చే సరికి మంచుగడ్ద ముక్క కరిగిపోయినట్లు కరిగిపోయింది. లబ్ధిదారుల చేతికి నీటి బింధువు చేరింది. అసలు దళితులను తఫ్పుదోవ పట్టించింది ఎవరు? అమాయక దళితులను నిండా ముంచిందెవరు? ఈ దళిత బంధు పధకంలో కార్లు ఒక్కటే కాదు 47 రకాల యూనిట్లు వున్నాయి. వాటిన్ని పరిస్దితి ప్రత్యేకంగా లేదు. అన్నీ యూనిట్ల పరిస్దితి ఇలాగే వుంది. వాటిపై కూడ ఒక్కొ అంశంపై మీ నేటిధాత్రిలో వరస కథనాలు.