దళిత రత్న అవార్డు ప్రధానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన డా”.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా
రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి
రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది డా “బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సావ కమిటీ వైస్ ఛైర్మన్ 57 ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ . రాష్ట్రఉపాధ్యక్షులు ఔషధం రవీందర్ .
పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషం గా ఉందని రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవకార్యక్రమాలు చేసి మరిన్ని మన్ననలను పొందుతానాని తెలియజేశారు.
అలాగే అవార్డు రావడానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జై భీమ్
