‘దళిత రత్న అవార్డు ప్రధానం’
బాలానగర్ నేటి ధాత్రి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా.. హైదరాబాదులోని సికింద్రాబాద్ బల్మర్ క్లాసిక్ గార్డెన్ లో సోమవారం దళిత రత్న అవార్డుల ప్రధానం చేశారు. బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కళ్లెం యాదయ్యకు దళితరత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు ఉత్సవాల సందర్భంగా తనకు దళిత రత్న అవార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.