యాదాద్రి లో భక్తుల రద్ది…

యాదాద్రి లో భక్తుల రద్ది
స్వామి వారి ఖజానాకు 42 లక్షలకు పైగా ఆదాయం
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

 

 

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిలాడింది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్‌క్స్‌ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, వీవీ ఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం నిర్వహించారు.స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది.

 

ఉత్సవ మూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారు జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. ఖజానాకు రూ. 42,25,140 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో భవానీ శంకర్‌, అదనపు ఈవో నవీన్,తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ద్వారం మ్యూజిక్ అకాడమీ(కుమారి కావ్య అలేఖ్య) హైదరాబాద్ వారి బృందముచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహించారు. ఆలయ ఎస్ వి ఎఫ్ ఆర్ ఐ శేషగిరిరావు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, కనకయ్య తిరుపతి సిద్దు ఆలయ సిబ్బంది ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version