అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎంపీ ధర్మపురి
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షాలకి నష్టపోయిన పంటలను పరిశీలించిన నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టం పై సత్వరమే సర్వే నిర్వహించి, నష్టపోయిన పంటకి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపాలి అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే పంటకు జరిగిన నష్టం పరిహారం అందెదని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాని అమలు చేయకుండా ఇప్పుడు రైతులకు నష్టం జరిగిదని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, సుకెందర్ గౌడ్ జిల్లా నాయకులు వాడేపల్లి శ్రీనివాసన్,వెంకట్ రెడ్డి,సదశివ్,రుద్ర శ్రీనివాస్,సుదవేణి మహేష్, తుకారాం గౌడ్, తిరుమల వాసు,శ్రీనివాస్,నవీన్,శ్రీధర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, మండల నాయకులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్, తిరుమల చారి,రాజారెడ్డి, మహేష్, సురేష్,వెంకట స్వామి, గణేష్, కౌడా రమేష్,ఆనంతు, రవి, అభి,మల్లేష్, రాజేందర్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.