వడగండ్ల వానతో నష్ట పోయిన పంటలు.!

వడగండ్ల వానతో నష్ట పోయిన పంటల ను పరీశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి :

, వడగండ్ల వానతో వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు.మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల సంకిరెడ్డి పల్లి గ్రామంలో వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ తో కలిసి పరిశీలించారు.వెంకట్ రాములు అనే వరి రైతు పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సంకిరెడ్డి పల్లి లో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా, వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం 170 ఎకరాల్లో పంట నష్టం అయిందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు, వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబీ తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ పీడీ పర్వతలు, డి ఈ విటోభా, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version