ఉపాధి హామీ డబ్బులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఉపాధి హామీ డబ్బులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T131704.246.wav?_=1

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులలో 40 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్లో తేల్చడం జరిగింది దీనికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండల అధికారి స్థానిక పంచాయతీ కార్యదర్శి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే అవినీతికి పాలు పడ్డారో వారి నుండి డబ్బులు రికవరీ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పనులు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ జరిగినవో సమగ్రమైన విచారణ చేసి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమానికి పాల్పడిన ఎవరైనా వారి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుపేద ప్రజలకు అండగా నిలబడి వారు కష్టపడి పని చేసిన వారికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అని అన్నారు సమగ్ర విచారణ జరగకపోతే చర్యలుతీసుకోకపోతే ఆ గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను ఐసా జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ రాజు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version