నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎరువులు విక్రయం చేసే సమయంలో తప్పనిసరిగా రైతుల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని చెప్పారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.