వెల్గటూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన – కొప్పుల

దొరిశెట్టి వెంకటయ్య మాకు ఒక స్పూర్తి – కొప్పుల ఈశ్వర్!!
ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి
వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొదటి రోజు మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,దొరిశెట్టి వెంకటయ్య తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, అయన్ని మేము జయశంకర్ గా పిలుచుకుంటాము, వారు చేసిన సమాజ సేవ కార్యక్రమాలు ఎవరు చేయలేరు, ఇవ్వన్నీ అందరితో సాధ్యం కాదు, ఇలాంటి సేవలు చేయడానికి ఎంతో గొప్పగా మనసు ఉండాలి, దొరిశెట్టి వెంకటయ్య మాకు ఒక స్పూర్తి అని కొప్పుల ఈశ్వర్ అన్నారు..అంతే కాకుండా వారు హైస్కూల్ కు స్వంత స్థలం ఇచ్చారు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారి భార్య, కుమారుని పేరు మీద నిర్వహించారు.ఈ క్రీకెట్ పోటీల్లో 60 టీం పాల్గొన్నాయి.
ఈ టోర్నమెంట్ లో గెలిచిన జుట్టు కు 50, వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లు కు 25 వేలు ఇవ్వడం జరిగింది. ఈ కార్య క్రమంలోఎంపిపి కూనమళ్ల లక్ష్మి ఎండ పల్లి,వెల్గటూర్ మండలాల బారాస అధ్యక్షులు సింహాచలం జగన్, రాం చందర్ గౌడ్,నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!