ఆడేపు ఓవర్సిస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని, ఖిలా వరంగల్ మైదానంలో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఆడెపు ఓవర్సీస్ సీఈవో ఆడెపు మధుసూదన్. ఈ రోజు ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో మొదటి ప్రత్యర్థులుగా చింతల్, హనంకొండ మధ్య జరగనుంది. టోర్నమెంట్ ఆర్గనైజర్ యెస్ కె రెహబార్ తో కలిసి ఓవర్సీస్ సీఈవో ఆడెపు మధుసూదన్ పోటీని ప్రారంభించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆడేపు మధుసూదన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడెపు ఓవర్సీస్ ఉద్యోగులు అరవింద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *