“CPM Demands Removal of Bogus Votes in Parakala”
నఖిలి ఓట్లను తొలగించాలిఅధికారులకు వినతిపత్రం అందజేసిన సీపిఎం నాయకులు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో గల 22 వార్డులలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని సిపిఎం పార్టీ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో విజయలక్ష్మి కి మరియు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు పట్టణ సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలోని ఓటర్ లిస్టులను వార్డుల వారిగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగించాలన్నారు.అదేవిధంగా ఓటు వేసే సమయంలో ఆధార్ కార్డు ఉంటూనే ఓటు వేసేందుకు అనుమతివ్వాలని కోరారు.2వార్డులో చనిపోయిన వారివి మరియు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్న వారి ఓటును తొలగించలేదని అలాంటి వారు ఇరు చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అలాంటి వాటిని గమనించి తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్,బొచ్చు ఈశ్వర్ పాల్గొన్నారు.
