జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటం
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి
శాయంపేట మండల సిపిఐ పార్టీ 2వ మహాసభ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాం దారి పేట వాసుల సమగ్రాభి వృద్ధికై సిపిఐ రాజీలేని పోరా టాలు నిర్వహిస్తుందని, గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి అన్నారు.
మండ లం.లోని పెద్ద కొడేపాక శివారు లో సిపిఐ శాయంపేట మండల 2వ మహాసభ ఘనంగా జరిగింది మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి జెండా ఆవిష్క రించారు.
అనంతరం ఎండీ అంకుషావలి అధ్యక్షతన జరిగిన మహాసభలో తోట భిక్షపతి మాట్లాడుతూ ఎన్ని కల సందర్భంగా హామీలను అమలు చేయడంలో పాలక పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందని అన్నారు.
మోడీ నమ్మిన బం టు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు.
విపక్ష పార్టీల నాయకు లపై సిబిఐ, ఈడిలను ప్రయోగి స్తున్న మోడీ ప్రభుత్వం ఆదానీ పై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని, విభజన హామీలను అమలు చేయ కుండా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేసారని అన్నారు.
రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తిగా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా అర్హులైనపేదలకు అందించా లని, జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
మండలం లో ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
జిల్లాలోని రైతాంగా నికి సాగునీరందించే ఎస్.ఆర్. ఎస్.పి, దేవాదుల కాలువ సమస్యలపై ఈ మధ్యకాలంలో సిపిఐ పోరాటం చేసిన ఫలితం గా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వటానికి అధికార యంత్రాంగం ముందుకు వచ్చిందని తెలిపారు.
ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటంలో సిపిఐ దే ఉమ్మడి జిల్లాలో అగ్రగామి పాత్ర అని, గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణoల్లో మున్సిపల్ వర్కర్స్, సంఘటిత, అసంఘ టిత కార్మికుల సమస్యలపై, నిలువనీడలేని పేదలకు ఇండ్ల స్థలాల కోసం గుడిసెల పోరా టాలు నడిపింది సిపిఐ అని, జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహి స్తుందని వారు అన్నారు.

ఈ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, సీనియర్ నాయకులు ఇల్లందుల సాంబయ్య, నాయకులు వల్లాల రమేష్, ఎండీ అంకుషావలి, సముద్రాల రవి, ముండది రమేష్, ఎండీ మైనొద్దిన్, సాంబయ్య, బోగి రమాదేవి, ఎండీ గౌసియా, రమాదేవి, బొంకురి కోమల, జోడు లక్ష్మీ మరియు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ మండల సమితి ఎన్నిక
సిపిఐ మండల కార్యదర్శిగా బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శులుగా అనుకారి అశోక్, సముద్రాల రవి, 9 మంది కార్యవర్గం, 18 మందితో మండల కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.