
CPI and Jana Samithi Leaders Condole MLA Madhav Reddy
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన సిపిఐ నాయకులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట శాసన సభ్యులు మాతృమూర్తి దొంతి కాంతమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించగా గురువారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలసి విమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల కార్యదర్శి అయిత యాకుబ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారధి, మాదన్నపేట రోడ్ సిపిఐ శాఖ కార్యదర్శి పిట్టల సతీష్, సహాయ కార్యదర్శి బాధరబోయిన యాదగిరి, గడ్డం నాగరాజు, మాతంగి సురేష్,కమ్మాల అరుణ, గౌరబోయిన పద్మ,కోలుగురి రాధిక తదితరులు పాల్గొన్నారు.
షేక్ జావిద్ ఆధ్వర్యంలో పరామర్శ..
తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పంది మాధవరెడ్డి హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. షేక్ జావిద్ తో విద్యావంతుల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి మహబూబాబాద్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మీర్జా మసూద్ అలీ మహమ్మద్ నుమాన్ మహమ్మద్ యూసుఫ్ ఆఫీస్ ఇర్ఫాన్ సాబ్ మహమ్మద్ హర్షద్ శ్రవణ్ లు ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల పరామర్శ..
నర్సంపేట ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డిని తన నివాసంలో నర్సంపేట పట్టణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి దొంతి కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల సమాఖ్య అధ్యక్షులు, కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్,ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, స్వేచ్ఛశ్రీ సంస్థ నిర్వాహకురాలు మైస వసంత, కన్స్యూమర్ ఫోరమ్ విజిలెన్స్ కమిటీ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్,మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవికాంత్, సోషల్ వాలంటీర్ కాసుల వెంకటాచారి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.