బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, ముల్కలపల్లి జాతరలో, జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొగుళ్లపల్లి ఎంపీడీవో పోస్టర్ ఆవిష్కరించారు. మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి అనూష బాలికల రక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రజలతో బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం కింద అవగాహన పంప్లేట్లను పంపిణీ చేశారు. జాతరలో సుమారు 5,000 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
