గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి
బీజేవైఎం నాయకులు వినతి
నిజాంపేట నేటి ధాత్రి:
గోహత్యలు, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్సై సృజనకు గో హత్యలు, గోవుల అక్రమ రవాణా చేసే వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవులు దైవ స్వరూపమని అలాంటి గోవులను కొంతమంది హత్యలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆవును తల్లిలా భావించి గోమాత అని పిలుచుకునే సాంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్, బోయిని ప్రణయ్ కుమార్, గజం రాజు, మేకల రమేష్, సందీప్ గౌడ్, బాసం అనిల్, భరత్, లు ఉన్నారు.