Cow Dies in Jaipur Road Accident
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు
జైపూర్,నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు
