కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఉగ్రవాదుల దాడి కి నిరసన గా మౌనం
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్,సిబ్బంది న్యాయవాదులు 22-04-2025 రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ వద్ద మన భారత విహార యత్రికులపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపి అమాయక భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇట్టి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో రెండు నిముషాలు మౌనం పాటించాలని గౌరవనీయులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల ననుసరించి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, చేర్యాల యందు కోర్టు సిబ్బంది మరియి న్యాయవాదులు రెండు నిముషాలు మౌనం పాటించి ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల కోర్టు సూపరిండెంట్ సుధాకర్ కోర్ట్ సిబ్బంది మరియు చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు