బాధిత కుటుంబాలకు పరామర్శ.
చిట్యాల నేటిధాత్రి:
చిట్యాల మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ డు నూతల నిశీధర్ రెడ్డి ,నవాబ్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ హకీం గత మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం నవాబ్ పేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బిల్ల సత్యనారాయణ రెడ్డి కి ఆక్సిడెంట్ జరగగా వారిని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా కైలా పూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అల్లం ఐలయ్య గత పది రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు
బిజెపి బూత్ అధ్యక్షుడు పందుల రాకేష్ గారు నానమ్మ పందుల రామక్క వారం రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించినారు,
ఆయన వెంట వరంగల్ పార్లమెంట్ లింగంపల్లి లింగంపల్లి ప్రసాద్ రావు బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మండల రాఘవరెడ్డి సుద్దాల వెంకటరాజ వీరు అనుప మహేష్ గో పగాని రాజు లక్ష్మణ్ శ్రీ పెళ్లి సతీష్ చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.